వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-02-01T23:34:43+05:30 IST

భర్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక చంద్రకళావతి (19) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన మండల పరిధిలోని కల్వటాలలో బుధవారం చోటు చేసుకుంది.

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
చంద్రకళావతి మృతదేహం

పెద్దముడియం, ఫిబ్రవరి 1: భర్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక చంద్రకళావతి (19) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన మండల పరిధిలోని కల్వటాలలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివ రాల మేరకు.. మైలవరం మం డలం గంగాలపల్లెకు చెందిన చంద్రకళావతికి పెద్దముడియం మండలం కల్వటాల గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్యకు సుమారు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరు గుతుండేవి. దీంతో పెద్దముడియం, తలమంచిపట్నం పోలీసుస్టేషన్లలో వారిరువురికీ కౌన్సిలింగ్‌ ఇవ్వడం వంటి సంఘటనలు పలు దఫాలుగా జరిగాయి. అయితే తాజాగా అదనపు కట్నం కావాలంటూ భర్త వేధిస్తున్నాడని చంద్రకళావతి తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పింది. ఈ విషయమై మంగళవారం రాత్రి భర్త, ఇతర కుటుంబసభ్యులు చంద్రకళావతి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయం చంద్రకళావతి తమ తల్లిదండ్రులకు ఫోను ద్వారా తెలిపింది. అయితే బుధవారం ఉదయం మనస్థాపానికి గురై ఇంట్లో గడ్డికి పిచికారిచేసే విషద్రావణం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చంద్రకళావతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి చెండ్రాయుడు ఫిర్యాదు మేరకు భర్త, ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పెద్దముడియం పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-01T23:34:47+05:30 IST