మహా శివరాత్రి ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ

ABN , First Publish Date - 2023-02-01T23:23:08+05:30 IST

మండలంలోని వంతాటిపల్లె గ్రామ పంచాయతీలో వెలసిన నిత్యపూజస్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రభాకర్‌ నాయడు, డీఈ సుధాకర్‌, ఏఈ సునీల్‌, ఈవో మోహన్‌రెడ్డిలు బుధవారం పరిశీలించారు.

మహా శివరాత్రి ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ
ఆలయం వద్ద పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు

సిద్దవటం, ఫిబ్రవరి 1: మండలంలోని వంతాటిపల్లె గ్రామ పంచాయతీలో వెలసిన నిత్యపూజస్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రభాకర్‌ నాయడు, డీఈ సుధాకర్‌, ఏఈ సునీల్‌, ఈవో మోహన్‌రెడ్డిలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోనలో దారికి అడ్డంగా ఉన్న బండరాళ్లను అటవీ శాఖాధికారులతో మాట్లాడి తొలగించినట్లు తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్‌ పాయింట్‌, పంచలింగాల కోనకు వెళ్లే రహదారిని పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌, చైర్మన్‌ పాటూరి కొండారెడ్డి, ఎండోమెంట్‌ సిబ్బంది చంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:23:09+05:30 IST