బాధితులకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2023-02-06T22:58:22+05:30 IST
స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశించారు.
పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ హర్షవర్ధన్రాజు
రాయచోటి టౌన్, ఫిబ్రవరి 6: స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన స్పందనలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 56 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల అర్జీలపై చర్యల నివేదికను ఎప్పటికప్పుడు పోలీసు ప్రధాన కార్యాలయానికి అందించాలని తెలిపారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పట్ల పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.