నవరత్నాల్లో ఒక రత్నాన్ని.. జగన మర్చిపోయాడు!

ABN , First Publish Date - 2023-02-01T23:39:19+05:30 IST

ఎన్నికల మేని ఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో ఒకదానిని అధికారంలోకి వచ్చాక జగన మరచిపోయాడని టీడీపీ మదనపల్లె ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి గుర్తుచేశారు.

నవరత్నాల్లో ఒక రత్నాన్ని.. జగన మర్చిపోయాడు!
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి

మాజీ ఎమ్మెల్యే: దొమ్మలపాటి

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 1: ఎన్నికల మేని ఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో ఒకదానిని అధికారంలోకి వచ్చాక జగన మరచిపోయాడని టీడీపీ మదనపల్లె ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి గుర్తుచేశారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం లోకి వస్తూనే మద్య నిషేధం చేస్తామని ప్రక టించిన జగన, ఆ విషయాన్ని మరచిపోవడమే కాకుండా, జే బ్రాండ్‌ మద్యంతో వైసీపీ నాయకు ల జేబులు నింపుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రలో కల్తీ మద్యం, నాటుసారా ఏరులై పారు తోందని, మదనపల్లెలో ఇద్దరు కార్మికులు నాటు సారాకు బలైనా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. నారా లోకేశ చేపట్టిన యువ గళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పటా ్టరన్నారు. ఈ పాదయాత్ర చూసి వైసీపీ నాయ కుల్లో గుబులు పుట్టిందని, వైసీపీని గద్దెదింపడ మే టీడీపీ నాయకులు, కార్యకర్తల లక్ష్యమనా ్నరు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్‌ జే వెంకటేశ, ఎస్‌ఎం రఫి, నాగయ్య, మధు బాబు, విజయ్‌కుమార్‌, వి.వెంకటేశ, వెంకట రమణారెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:39:34+05:30 IST