చెత్తసేకరణ వంద శాతం జరగాలి : కమిషనర్
ABN , First Publish Date - 2023-02-01T22:53:51+05:30 IST
చెత్త సేకరణ వంద శాతం జరగాలని కమిషనర్ ప్రవీణ్చంద్ అన్నారు.
కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 1: చెత్త సేకరణ వంద శాతం జరగాలని కమిషనర్ ప్రవీణ్చంద్ అన్నారు. క్లాప్ ఆటోలు రోజుకు మూడు టిప్పులు తిరగాలని ఆదేశించారు. కడప నగరం 48వ డివిజన్లో పారిశుధ్య పనులు పరిశీలించి సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించకూడదని సూచించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ జరగాలన్నారు. రోడ్లపైన, కాల్వ ల్లో చెత్త వేయకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.