అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-02-01T23:38:00+05:30 IST

మండల పరిధిలోని కరమలవారిపల్లికి చెందిన ఎర్రంరెడ్డి రామ సంజీవరెడ్డి (34) అనే రైతు అప్పులబాధ తాళలేక ఇంట్లోనే విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు.

అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య

మైలవరం, ఫిబ్రవరి 1: మండల పరిధిలోని కరమలవారిపల్లికి చెందిన ఎర్రంరెడ్డి రామ సంజీవరెడ్డి (34) అనే రైతు అప్పులబాధ తాళలేక ఇంట్లోనే విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. రామ సంజీవరెడ్డికి ఉన్న రెండు ఎకరాల పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకునే వారు. ఈ క్రమంలో పొలానికి పురుగుల మందులు, విత్తనాలకు, కుటుంబ పోషణకు పలువురి వద్ద అప్పులు చేశాడు. పంటలు సరిగా పండక పోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్ధాపం చెంది మంగళవారం రాత్రి ఇంట్లోనే విషద్రావణం తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే జమ్మలమడుగు ఆస్పత్రికి తరలించగా చికిత్సలు పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. రామ సంజీవరెడ్డి భార్య కృష్ణ కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2023-02-01T23:38:05+05:30 IST