టీడీపీ నేతలపై రౌడీ రాజకీయాలు మానుకోండి

ABN , First Publish Date - 2023-02-06T23:28:33+05:30 IST

టీడీపీ నేతలపై రౌడీ రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ్ట నేతలకు టీడీపీ రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ సూచించారు.

టీడీపీ నేతలపై రౌడీ రాజకీయాలు మానుకోండి

వైసీపీ నేతలకు బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌ సూచన

కురబలకోట, జనవరి 6: టీడీపీ నేతలపై రౌడీ రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ్ట నేతలకు టీడీపీ రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ సూచించారు. మాజీ మంత్రి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ల్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్రను అక్ర మంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. సోమవారం మండలంలోని అంగళ్ళులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించే గొంతు నొక్కడానికి ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతు న్నారన్నారు. వెంటనే కొల్లు రవీంద్రను బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఒక పక్క బీసీల ఓట్ల కోసం బీసీలడిక్లరేషన, బీసీ గర్జన పేరుతో నాటకమాడుతూ మరో పక్క బీసీలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. గత మూడున్నరేళ్ళ పాలనలో 26మంది బీసీలు హత్యలకు గురయ్యారని వందలాది మందిపై అక్రమ కేసులు పెట్టార న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలపై దాడులు హెచ్చుమీరాయన్నారు.

Updated Date - 2023-02-06T23:28:35+05:30 IST