మతసామరస్యాన్ని చాటిన ముస్లిం కుటుంబం
ABN , First Publish Date - 2023-02-06T23:24:20+05:30 IST
ములకలచెరువు కు చెందిన ఓ ముస్లిం కుటుంబం చౌడేశ్వరి అమ్మవారికి బంగారు ఆభరణం అందజేసి మతసామరస్యాన్ని చాటుకుంది.
చౌడేశ్వరీదేవి అమ్మవారికి బంగారు ఆభరణం అందజేత
ములకలచెరువు, ఫిబ్రవరి 6: ములకలచెరువు కు చెందిన ఓ ముస్లిం కుటుంబం చౌడేశ్వరి అమ్మవారికి బంగారు ఆభరణం అందజేసి మతసామరస్యాన్ని చాటుకుంది. సోంపాళ్యం లోని పురాతన శ్రీమత్కోట చౌడేశ్వరీదేవి అమ్మవారికి స్ధానిక నట్లగుట్టకు చెందిన పి.రసూల్, ఆయన భార్య శంషాద్లు సోమవా రం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.60,500 విలువ చేసే బంగారు ఆభరణాన్ని పూజారి వేమనారాయణకు అందజేశారు. ముస్లిం కుటుం బం అమ్మవారికి బంగారు ఆభరణాన్ని అందజేసి ఆదర్శంగా నిలిచింది. దీంతో పూజారు లు, గ్రామస్తులు ముస్లిం కుటుంబాన్ని అభినందించారు.