ఆలయానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2023-02-01T23:21:53+05:30 IST

మండల కేంద్రానికి సమీపంలోని ఏటిగడ్డరాచపల్లె పొలిమేరలో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన కొండూరు నారాయణరాజు కుటుంబ సభ్యులు రూ.లక్షా 116 విరాళాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆలయానికి రూ.లక్ష విరాళం
నగదు అందజేస్తున్న దాతలు

సుండుపల్లె, ఫిబ్రవరి 1: మండల కేంద్రానికి సమీపంలోని ఏటిగడ్డరాచపల్లె పొలిమేరలో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన కొండూరు నారాయణరాజు కుటుంబ సభ్యులు రూ.లక్షా 116 విరాళాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుండుపల్లె ఏటిగడ్డ రాచపల్లెలో భారీ అంచనాలతో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే పలువురు దాతలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామగంగరాజు, రెడ్డెయ్యరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:21:54+05:30 IST