ఎంత పనిచేశావమ్మా!

ABN , First Publish Date - 2023-02-07T03:49:16+05:30 IST

కుటుంబ వివాదాల నేపథ్యంలో తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఎంత పనిచేశావమ్మా!

తల్లి, ఇద్దరు పిల్లల బలవన్మరణం

భర్త వివాహేతర సంబంధమే కారణం

నరసరావుపేట లీగల్‌, ఫిబ్రవరి 6 : కుటుంబ వివాదాల నేపథ్యంలో తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మహాలక్ష్మి నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన దొండేటి ఇంద్రారెడ్డి ఆర్‌కే సెంటర్‌లో పని చేస్తుంటాడు. ఆయన భార్య శివలింగేశ్వరి టైలరింగ్‌ షాపులో పని చేస్తోంది. ఇంద్రారెడ్డికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం శివలింగేశ్వరి పిల్లలను పాఠశాలకు తీసుకు వెళ్లమని భర్త ఇంద్రారెడ్డిని కోరగా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. శివలింగేశ్వరి అత్తమామలు కూడా బయటకు వెళ్లారు. సాయంత్రం మామ ఇంటికి తిరిగి వచ్చి ఎంత పిలిచినా శివలింగేశ్వరి తలుపులు తీయలేదు. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా శివలింగేశ్వరి (27), ఆమె కుమారుడు దొండేటి సాయి చరణ్‌రెడ్డి(8), దొండేటి జెతిన్‌రెడ్డి(4) ఉరి వేసుకొని వేలాడుతూ కన్పించారు. డీఎస్పీ విజయ భాస్కర్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-02-07T03:49:18+05:30 IST