ఆ సమయంలో పీపీగా పనిచేశా
ABN , First Publish Date - 2023-01-25T04:14:32+05:30 IST
అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గతేడాది మార్చిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

చంద్రబాబు, నారాయణ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గతేడాది మార్చిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అప్పట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న తనను దర్యాప్తు అధికారులు సంప్రదించారని గుర్తుచేశారు. వ్యాజ్యాలు మరో బెంచ్ ముందు విచారణకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.