టెన్నిస్ జిల్లా జట్ల క్రీడాకారుల ఎంపిక
ABN , First Publish Date - 2023-02-07T01:08:50+05:30 IST
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని స్కూల్ గేమ్స్ అండర్ - 14, అండర్ -17 బాల బాలికల టెన్నిస్ జిల్లా జట్లను ఎంపిక చేశారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో వీరిని ఎంపిక చేశారు.
నరసరావుపేట కల్చరల్, ఫిబ్రవరి 6: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని స్కూల్ గేమ్స్ అండర్ - 14, అండర్ -17 బాల బాలికల టెన్నిస్ జిల్లా జట్లను ఎంపిక చేశారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో వీరిని ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అండర్ - 17 బాలర జట్టులో తేజిత్, ఎస్కే అహమ్మద్, వీ.శేషసాయి, షేక్.ఎండీ జమీర్, వశిష్ఠ, బీ.అజయ్, అండర్-17 బాలికల జట్టులో కే.మైత్రేయి, సీహెచ్ నందిత శ్రీ, కే.కావ్య అమృత, ఓ.పూజిత, కే.చరిష్మ, అండర్-14 బాలికల జట్టులో జీ.జోషిత, శివశశిప్రియ, ఎం.లిల్లిగ్రేస్, ఎస్కే.రషీద, ఎం.బిందు పూర్ణిమలు ఎంపికయ్యారు. అండర్-14 బాలుర జట్టులో కే.విన్సెంట్, జీ.దిశాంత్, షేక్ అహమ్మద్, కే.నిషాల్, వై.నీరజ్రెడ్డిలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సీహెచ్ కోటేశ్వర రావు ప్రకటించారు. కార్యక్రమంలో సరస్వతి మందిర్ పాఠశాల డైరెక్టర్ మిరియాల నాగప్రసాదు, వ్యాయామ ఉపాధ్యాయులు పూజల శ్రీనివా సరావు, ఖేలో ఇండియా జిల్లా కో-ఆర్డినేటర్ లాకు పిచ్చయ్య, గుంటూరు జిల్లా సాప్ట్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి కడియం జయరామ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.సుబ్రహ్మణ్యం, షేక్గౌస్, ఐ.సునీల్, ఎన్ వెంకట్రామయ్య, వీ.ప్రసాదు, ఎం.విక్రమ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.