AP News: పెళ్లిబృందం వాహనాన్ని ఢీకొన్న టిప్పర్... ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2023-01-27T09:49:24+05:30 IST

జిల్లాలోని వెల్దుర్తి సమీపంలో పెళ్లి బృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

AP News: పెళ్లిబృందం వాహనాన్ని ఢీకొన్న టిప్పర్... ముగ్గురు మృతి

పల్నాడు: జిల్లాలోని వెల్దుర్తి సమీపంలో పెళ్లి బృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందింది. మరో ఆరుగురుకి గాయాలయ్యాయి. ప్రమాదంలో సమయంలో కారులో 9 మంది ఉన్నారు. పెళ్ళి బృందం ముటకూరు నుంచి శిరిగిరిపాడు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-01-27T09:49:25+05:30 IST