టీడీపీ వెంటే పల్నాడు మైనార్టీలు
ABN , First Publish Date - 2023-02-07T01:23:57+05:30 IST
గురజాల నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం మైనారిటీల కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పెద్ద కొడుకుగా వుంటుండటాన్ని ముస్లిం కుటుంబాలకు చెందిన వారందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని పల్నాడు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అమీర్అలి తెలిపారు.
జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అమీర్అలి
పిడుగురాళ్ల, ఫిబ్రవరి 6: గురజాల నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం మైనారిటీల కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పెద్ద కొడుకుగా వుంటుండటాన్ని ముస్లిం కుటుంబాలకు చెందిన వారందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని పల్నాడు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అమీర్అలి తెలిపారు. సోమవారం పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా పల్నాడులో ముస్లిం ఆత్మ బంధువుగా యరపతినేనిని మేమందరం గుర్తుంచుకుంటామని, ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పించటంతో పాటు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండటం ఎన్నో కుటుంబాలకు ఆసరాగా ఉందని అమీర్అలి తెలిపారు. పిడుగురాళ్లలో అస్లాం కుటుంబానికి జీవనోపాధిని యరపతినేని కల్పిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఉపాధికి పొట్టకొట్టడమే కాకుండా అస్లాం మృతిచెందినా తగిన భరోసా కల్పించడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారన్నారు. ఒక్క అస్లాం కుటుంబానికే కాదు ఎక్సైజ్ అధికారుల వేధింపులతో చనిపోయిన అలీసా, గామాలపాడులో గౌసు, తుమ్మలచెరువులో సైదా కుటుంబాలతో పాటు తురకపాలెంలో ఉమర్ కుటుంబానికి యరపతినేని సాయం అందించడం నిజంగా గొప్ప విషయమని అమీర్అలి, మైనారిటీ నాయకులు షేక్ ముజీబ్, సయ్యద్ ఇర్షాద్లు తెలిపారు. పల్నాడులో ముస్లింలు యరపతినేనికి, టీడీపీకి అండగా వుంటారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో షేక్ ఖాశింసైదా, గుత్తికొండ సుభాని, డాక్టర్ వలి, సర్దార్, కరాలపాడు జాని, వాచర్ బుడే, గ్యాస్ జిలాని, గురజాల సైదా, ఇమాంసా, బాష, రఫీ, షఫీ, తదితరులు పాల్గొన్నారు.