టీడీపీలోకి వైసీపీ సర్పంచ్
ABN , First Publish Date - 2023-02-07T01:21:01+05:30 IST
నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మి గత సర్పంచ్ ఎన్నిక ల్లో వైసీపీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశాన్ని ఆశించి భంగపడి ఆ పార్టీ రెబల్ అభ్యర్థినిగా పోటీచేసి సర్పంచ్గా విజయం సాధించింది. అనంతరం పరిణామాలు, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు విరక్తి చెం
నిడదవోలు, ఫిబ్రవరి6: నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మి గత సర్పంచ్ ఎన్నిక ల్లో వైసీపీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశాన్ని ఆశించి భంగపడి ఆ పార్టీ రెబల్ అభ్యర్థినిగా పోటీచేసి సర్పంచ్గా విజయం సాధించింది. అనంతరం పరిణామాలు, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు విరక్తి చెందిన ఆమె టీడీపీ తీర్థం తీసుకున్నారు. సోమవారం నిడదవోలులో జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఆమె టీడీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఆమెతోపాటు ఆమె భర్త గుత్తుల రాధాకృష్ణ, వెదుళ్ళపల్లి శ్రీను తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే శేషారావు సభ్యత్వాన్ని ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.