రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువు: మోజేష్‌బాబు

ABN , First Publish Date - 2023-02-07T01:02:31+05:30 IST

రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువైయిందని ఆలిండియా క్రీష్టియన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు కోడే మోజేష్‌బాబు అన్నారు. మండలంలోని అచ్చన్నపాలెం బేతేలు ప్రార్ధన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన గోపాలపురం డివిజన్‌ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువు: మోజేష్‌బాబు

నల్లజర్ల, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువైయిందని ఆలిండియా క్రీష్టియన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు కోడే మోజేష్‌బాబు అన్నారు. మండలంలోని అచ్చన్నపాలెం బేతేలు ప్రార్ధన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన గోపాలపురం డివిజన్‌ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆలిండియా క్రీష్టియన్‌ కౌన్సిల్‌, పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సంఘాలు వేర్వేరు కాదని, పరస్పర అనుబంధ సంఘాలేనని, ఇవన్నీ సేవా కార్యక్రమాలకేనని పేర్కొన్నారు. పాస్టర్లకు ఏ సమస్య వచ్చినా ఐక్యతతో పరిష్కరించుకోవాలన్నారు.కాకినాడ జిల్లాలో పాస్టర్‌పై జరిగిన దాడిని హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి టి.సుకుమార్‌, శ్యాంబాబు, జోషి, శామ్యూల్‌ రాజు, ముంగమూరి ప్రసాద్‌బాబు, తానేటి రాజు, గపూర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:02:33+05:30 IST