అఖిలభారత దళిత రచయితల సమ్మేళనానికి శిఖామణికి ఆహ్వానం

ABN , First Publish Date - 2023-02-02T02:06:35+05:30 IST

సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ నిర్వహణలో రెండు రోజులు ఢిల్లీలో జరగనన్న వరల్డ్‌ దళిత్‌ రైటర్స్‌ మీట్‌లో పాల్గొనేందుకు యానానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకులు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంతి ఆచార్యులు, కవి సంధ్య పత్రిక సంపాదకులు, కళారత్న డాక్టర్‌ శిఖామణికి ఆహ్వానం అందింది.

అఖిలభారత దళిత రచయితల సమ్మేళనానికి శిఖామణికి ఆహ్వానం

యానాం, ఫిబ్రవరి 1: సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ నిర్వహణలో రెండు రోజులు ఢిల్లీలో జరగనన్న వరల్డ్‌ దళిత్‌ రైటర్స్‌ మీట్‌లో పాల్గొనేందుకు యానానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకులు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంతి ఆచార్యులు, కవి సంధ్య పత్రిక సంపాదకులు, కళారత్న డాక్టర్‌ శిఖామణికి ఆహ్వానం అందింది. ఈనెల20,21తేదీల్లో ఢిల్లీలో జరిగే అఖిల భారత దళిత రచయితల సమ్మేళనంలో భాగంగా జరిగే బహుభాషా కవి సమ్మేళనాల్లో డా శిఖామణి ఒక సదస్సుకు అధ్యక్షతన వహించడంతో పాటు తన స్వీయ దళిత కవితలు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చదివి వినిపించడం జరుగుతుంది. ఈమేరకు కేంద్రసాహిత్య అకాడమీ కార్యదర్శి డా.కృత్తివెంటి శ్రీనివాసరావు నుంచి తనకు ఆహ్వానలేఖ అందినట్లు శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-02-02T02:06:36+05:30 IST