రీసర్వే వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-02-07T00:54:53+05:30 IST
ఏజెన్సీలో జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా చేపట్టిన రీసర్వే వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే అధికారులను ఆదేశించారు.
రంపచోడవరం, ఫిబ్రవరి 6: ఏజెన్సీలో జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా చేపట్టిన రీసర్వే వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే అధికారులను ఆదేశించారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సర్వేయర్లకు సర్వేకు సంబంధించిన పరికరాలు, రెయిన్కోట్లు, మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన సబ్ కలెక్టరు శుభం బన్సల్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో రీసర్వే చేసి ప్రభుత్వ, రైతు వారి భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సుమారు 80 మంది గ్రామ సర్వేయర్లకు కిట్లు అందజేసినట్లు తెలిపారు. సర్వేకు ముందు గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సర్వే టీంలు అందుబాటులో ఉండాలన్నారు. సర్వేలో సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ కె.దేవేంద్రుడు, డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్లు రవిశంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.