రాజ్యాంగ రక్షణకు బీఎస్పీ అధికారంలోకి రావాలి

ABN , First Publish Date - 2023-02-02T02:01:36+05:30 IST

భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే దేశంలో, రాష్ట్రాల్లో బీఎస్పీ అధికారంలోకి రావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి పేర్కొన్నారు.

రాజ్యాంగ రక్షణకు బీఎస్పీ అధికారంలోకి రావాలి

పి.గన్నవరం, ఫిబ్రవరి 1: భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే దేశంలో, రాష్ట్రాల్లో బీఎస్పీ అధికారంలోకి రావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార చైతన్య యాత్రలో భాగంగా పోతవరం ప్రధాన రహదారి చెంతన జరిగిన బహిరంగసభకు జిల్లా అధ్యక్షుడు చింతా సత్య అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడారు. బహుజనులను చైతన్యవంతులను చేయడానికే రాజ్యాధికార చైతన్య యాత్రలు చేపట్టామన్నారు. దేశంలో, రాష్ట్రాల్లో మనువాద పార్టీలు ఉన్నాయని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈపార్టీలను బహుజనులు భరిస్తున్నారని అన్నారు. 80శాతం ఉన్న బహుజనులు చైతన్యవంతులైతే రాష్ట్రంలో, దేశంలో ఏపార్టీలు అధికారంలోకి రాలేవని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం ఊడిమూడికి చెందిన వార్డుమెంబరు నేలపూడి లెనిన్‌ను ఆయన సన్మానించారు. రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్లు గెడ్డం సంపదరావు, గుమ్మల చిత్రసేను, ఆర్‌జె మల్లికల్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కొల్లాబత్తుల సత్యం, కరణం తిరుపతిరావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు బోనే కృష్ణ, జిల్లా ఇన్‌చార్జ్‌ కాండ్రేగుల నరసింహం, కాశి భవాని, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T02:01:37+05:30 IST