‘రక్తదానంతో ప్రాణదాతలు కావాలి’

ABN , First Publish Date - 2023-02-02T01:57:43+05:30 IST

:రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణాలు కాపాడటానికి వీలవుతుందని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారిణి కె.షర్మిళ అశోక అన్నారు.

‘రక్తదానంతో ప్రాణదాతలు కావాలి’

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 1 :రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణాలు కాపాడటానికి వీలవుతుందని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారిణి కె.షర్మిళ అశోక అన్నారు. బుధవారం రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని షర్మిళా అశోక పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, రావులపాలెం డిపోలకు చెందిన 78 మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్‌ ఎస్‌కే షబ్నం, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రసూనాంబ, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:57:46+05:30 IST