TTD: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.12 లక్షల విరాళం

ABN , First Publish Date - 2023-01-20T21:30:58+05:30 IST

టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు శుక్రవారం రూ.12 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఈవీఎస్‌ఆర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ..

TTD: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.12 లక్షల విరాళం

తిరుమల: టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు శుక్రవారం రూ.12 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఈవీఎస్‌ఆర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన రాఘవేంద్ర ఈవిరాళాన్ని తిరుపతి (Tirupati)లోని పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy), ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అలాగే బెంగళూరుకు చెందిన కేసీ రెడ్డి, సరోజమ్మ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ తరఫున ఎస్వీబీసీ బోర్డు (SVBC Board) సభ్యురాలు వసంత కవిత రూ.2లక్షలు అందజేశారు.

Updated Date - 2023-01-20T21:31:06+05:30 IST