Tirumala ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు వాయిదా
ABN , First Publish Date - 2023-01-27T11:36:52+05:30 IST
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయానికి బంగారు తాపడం పనుల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయానికి బంగారు తాపడం పనుల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు రెండు సంవత్సరాలైనా ఇంకా పూర్తి కాలేదన్నారు. శ్రీవారి ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పనులు వేగవంతంగా నిర్వహించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తూన్నామన్నారు. ఆరు నెలల కాల పరిధిలో టెండర్ల ప్రకియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అలాగే రథసప్తమికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.