అంతర్వేదిగూడెంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ABN , First Publish Date - 2023-02-06T21:11:39+05:30 IST

బుట్టాయగూడెం (Butteyagudem) మండలం అంతర్వేదిగూడెం పంచాయతిలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు...

అంతర్వేదిగూడెంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): బుట్టాయగూడెం (Butteyagudem) మండలం అంతర్వేదిగూడెం పంచాయతిలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ (YCP) ప్రభుత్వ పాలనలో అధిక ధరలు, నాసిరకం మద్యం అమ్మకాలు, నిరుద్యోగ సమస్యతో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీ (TDP) ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని.. అందుకు మద్దతుగా 91 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూసం ముక్కమ్మ, కొమరం మల్లేశ్వరరావు, ఆండ్రు శ్యామ్ కుమార్ (జాంగిరి), తెల్లం వెంకటేశ్వరరావు, వెట్టి రాయుడు, కోవ్వాసి వెంకన్నబాబు, కొర్సా పొసి, తాటి. దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Untitled-9.jpg

Updated Date - 2023-02-06T21:11:40+05:30 IST