విషాదం.. ఇద్దరు కుమారులతో తల్లి బలవన్మరణం

ABN , First Publish Date - 2023-02-06T18:11:50+05:30 IST

జిల్లాలోని నరసరావుపేటలోని పెద్దచెరువులో విషాదఘటన చోటుచేసుకుంది.

విషాదం.. ఇద్దరు కుమారులతో తల్లి బలవన్మరణం

పల్నాడు: జిల్లాలోని నరసరావుపేటలోని పెద్దచెరువులో విషాదఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులతో సహా ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు శివలింగేశ్వరి(27), చరణ్‌సాయి(8), జతిన్‌(4)గా గుర్తించారు. ఆత్మహత్యల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అసలు వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు? ఎవరైనా వేధింపుల వలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక వేరే కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

Updated Date - 2023-02-06T18:11:54+05:30 IST