Chandrababu: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ.. ప్రస్తావించిన విషయాలు ఇవే

ABN , First Publish Date - 2023-02-07T16:50:48+05:30 IST

తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.

Chandrababu: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ.. ప్రస్తావించిన విషయాలు ఇవే

చిత్తూరు: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడు (Tamilanadu) కు గ్రానైట్ అక్రమ రవాణా జరగుతుందని లేఖలో ఆయన ప్రస్తావించారు. కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరికి కొత్తూరు ద్వారా వేపనపల్లికి గ్రానైట్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. మోట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ తరలిస్తున్నారని లేఖ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. గ్రానైట్ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-07T16:50:50+05:30 IST