AP News: వారికి అడ్మిషన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2023-01-30T18:01:17+05:30 IST
ఏపీ హైకోర్టు (AP Highcourt)కు వీసీ ఆనందరావు (VC Aandarao), రిజిస్ట్రార్ మధుసూదన్ వర్మ (Madhusudan Varma) హాజరయ్యారు.
అమరావతి: ఏపీ హైకోర్టు (AP Highcourt)కు వీసీ ఆనందరావు (VC Aandarao), రిజిస్ట్రార్ మధుసూదన్ వర్మ (Madhusudan Varma) హాజరయ్యారు. పూర్వ విద్యార్థులకు అడ్మిషన్లు (Admissions) ఇచ్చామని వీసీ, రిజిస్ట్రార్ తెలిపారు. రెండు కన్నా ఎక్కువ పీజీలు చదవకూడదన్న పాలకమండలి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పూర్వ విద్యార్థులు శ్రీరాములు (Sriramulu), నాగరాజు (Nagaraju) పిటిషన్ దాఖలు చేశారు. రెండు పీజీ (PG)లు మాత్రమే చదవాలనే నిబంధనలను హైకోర్టు తొలగించింది. శ్రీరాములు, నాగరాజుకు అడ్మిషన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది.