అసమర్థ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం : టీడీపీ

ABN , First Publish Date - 2023-02-06T23:23:30+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసమర్థ పా లనతో రాష్ట్రంలో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని టీడీపీ నాయకులు విమ ర్శిం చారు.

అసమర్థ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం : టీడీపీ

సోమందేపల్లి, ఫిబ్రవరి 6: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసమర్థ పా లనతో రాష్ట్రంలో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని టీడీపీ నాయకులు విమ ర్శిం చారు. సోమవారం స్థానిక ద్వారకామయి నగర్‌లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి, వైసీపీ పాలనలోని వైఫల్యాల ను వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. టీడీపీ పాలనలో దేశంలోనే ఆంధ్రప్రదేశకు ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని వాపోయారు. నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతు న్నా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయకులు అశ్వర్థప్ప, బాబయ్య, రామాంజి, హుస్సేన, అమరప్ప, శివప్ప, లక్ష్మీనారాయణ, మనోజ్‌, కే నారాయణ, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:23:34+05:30 IST