రుద్రమ్మ వలస..!
ABN , First Publish Date - 2023-02-02T00:48:28+05:30 IST
రాయదుర్గం బస్టాండు సమీపంలో పింఛన సొమ్ముకోసం వేలిముద్ర వేస్తున్న ఈమె పేరు రుద్రమ్మ. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యురాలు ఈమె.
రాయదుర్గం బస్టాండు సమీపంలో పింఛన సొమ్ముకోసం వేలిముద్ర వేస్తున్న ఈమె పేరు రుద్రమ్మ. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యురాలు ఈమె. వైసీపీ మద్దతుదారు కూడా..! గతంలో తనకు, తన భర్త గంగన్నకు పింఛన వచ్చేదని, 9 నెలల క్రితం తన భర్త పింఛనను ప్రభుత్వం తొలగించిందని ఆమె తెలిపింది. ఒక పింఛనతో బతకడం కష్టం కావడంతో బెంగుళూరుకు వలస వెళ్లామని, అక్కడ సిమెంట్ పని చేస్తున్నామని పేర్కొంది. పింఛన తీసుకునేందుకు ప్రతి నెలా ఆమె రాయదుర్గానికి వస్తుంది. బస్టాండ్లోనే వలంటీర్ వద్ద పింఛన తీసుకుని, తిరిగి బస్సు ఎక్కి బెంగళూరుకు వెళ్లిపోతుంది. సొంతూరిలో ఉపాధి పనులకు వెళ్లేందుకు జాబ్ కార్డు అడిగితే, వయసు అయిపోయింది కాబట్టి ఇవ్వలేమని అంటున్నారని, గత్యంతరం లేక వలస వెళ్లి బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.
- రాయదుర్గం