అరాచక పాలనకు అంతం పలుకుదాం
ABN , First Publish Date - 2023-02-06T23:46:44+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానికి అంతం పలుకుదామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
‘ఇదేం ఖర్మ’లో మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి, ఫిబ్రవరి 6: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానికి అంతం పలుకుదామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధి లోని సోమవారం బడేనాయక్ తండా, గోనేనాయక్ తండాలలో ఇదేమి ఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో వైసీపీ పాలన గూండా రాజ్యాన్ని తలపిస్తోందని మండిపడ్డారు. ఒక పక్కన దౌర్జన్యాలు, మరో పక్క భూకబ్జాలు, అమాయ కులపై అక్రమకేసులు పెరిగిపోయాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్యులకు బతుకు భారంగా మారింద న్నారు. నవరత్నాలపేరుతో ముఖ్యమంత్రి జగన బటన నొక్కడమే కానీ పేదల బతుకులు మాత్రం మారలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు రామాంజనేయులు, సామకోటి ఆదినారాయణ, గూడూరు ఓబులేసు, అవుల సుబ్రహ్మణ్యం, బేకరి నాయుడు, వెంకటేశు నాయక్, మనోహర్, బీడుపల్లి రాము, రమేష్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.