ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-02-06T23:42:11+05:30 IST
నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయకపోవడంపై స్థానిక వివేకానంద జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేపాక్షి, ఫిబ్రవరి 6: నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయకపోవడంపై స్థానిక వివేకానంద జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ పాఠశాలను సందర్శించి, సిలబ్సను సకాలంలో పూర్తి చేయకపోవడాన్ని గమనించారు. ఈ విషయంపై డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారించి, పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీఈఓ సోమవారం పాఠశాలను తనిఖీ చేసి, సంబంధిత ఉపాధ్యాయులు, హెచఎంను విచారించారు. సిలబస్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగరాజునాయక్ పాల్గొన్నారు.