ప్రత్యేక రైలు కొనసాగింపు

ABN , First Publish Date - 2023-02-02T00:08:41+05:30 IST

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి అహ్మదాబా ద్‌-తిరుచునాపల్లి-అహ్మదాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక వీక్లీ రైలును మరి కొంత కాలం కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం పేర్కొన్నారు.

ప్రత్యేక రైలు కొనసాగింపు

గుంతకల్లు, ఫిబ్రవరి 1: ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి అహ్మదాబా ద్‌-తిరుచునాపల్లి-అహ్మదాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక వీక్లీ రైలును మరి కొంత కాలం కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం పేర్కొన్నారు. అహ్మదాబా ద్‌-తిరుచునాపల్లి ప్రత్యేక రైలు (నెం. 09419)ను ఈ నెల 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకూ నడపనున్నట్లు తెలియజేశారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 09420) ఈనెల 5వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ రైళ్లు అప్‌ అండ్‌ డౌన్‌ కలిపి 18 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. ఈ ప్రత్యేక రైలు వడోదర, సూరత్‌, వాపి, వసాయి రోడ్డు, కల్యాణ్‌, పూనే, షోలాపూర్‌, కలబురిగి, వాడి, రాయచూర్‌్‌, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, తాడిపత్రి, కడప, రేణిగుంట, అరక్కోణం, పెరంబూరు, చెన్నై, ఎగ్మోర్‌, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, చిదంబరం, కుంభకోణం, పాపనాశం, తంజా వూరు స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

Updated Date - 2023-02-02T00:08:43+05:30 IST