పెళ్లి భోజనం చేశాడని.. ఎంబీఏ విద్యార్ధితో..

ABN, First Publish Date - 2022-12-02T22:02:01+05:30 IST

పిలవని పెళ్లికి వచ్చి భోజనం చేశాడని ఎంబీఏ విద్యార్థిని అవమానించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పిలవని పెళ్లికి వచ్చి భోజనం చేశాడని ఎంబీఏ విద్యార్థిని అవమానించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమ ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఓ విద్యార్థి వచ్చి భోజనం చేయడం చేయడాన్ని గమనించిన నిర్వాహకులు నీచంగా ప్రవర్తించారు. ఎంబీఏ చదువుతున్నాడని తెలిసికూడా కర్కశంగా ప్రవర్తించారు. తాజాగా భోపాల్‌లోని ఓ ఫంక్షన్ హాలులో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. బంధుమిత్రులు సహా వందలాది మంది ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఆ పెళ్లి విందులో అపరిచిత వ్యక్తి వచ్చి విందులో ముందు వరుసలో వచ్చి నచ్చినవన్నీ తిట్టాడు. ఈ విషయాన్ని గమనించిన పెళ్లింటివారు ఎవరి తరపున బంధువు అంటూ ప్రశ్నించారు. అయితే దీనికి తాను ఎంబీఏ విద్యార్థిని అని ఆకలి కావడంతో ఇక్కడికి వచ్చానని చెప్పాడు. పెళ్లి భోజనం చేసిన వారందరీ ప్లేట్లు కడిగించారు.

Updated at - 2022-12-02T22:02:04+05:30