Hyderabad: మల్టీజెట్ స్కీమ్ పేరుతో భారీ మోసం.. కోట్లు వసూలు చేసి పరారు

ABN, First Publish Date - 2022-11-26T20:03:20+05:30 IST

హైదరాబాద్‌లో మల్టీజెట్ స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది.

హైదరాబాద్: హైదరాబాద్‌లో మల్టీజెట్ స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. రూ. 14 వేలు పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ ప్రచారం చేశారు. ప్రతిరోజూ డబ్బులు ఇస్తామంటూ చెప్పి కొన్నాళ్లపాటు డబ్బులు చెల్లించి నమ్మించారు కేటుగాళ్లు. దీంతో వేల సంఖ్యలో కస్టమర్లు పెట్టుబడులు పెట్టారు. తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.100 కోట్లకు పైగా కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టి కంపెనీ ఎండీ ముత్తిరాజు పరారైయ్యారు. పరారీలో ఉన్న మల్టీజెట్ ఎండీ ముత్తిరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీఎస్ దగ్గర మల్టీజెట్ స్కీమ్ బాధితులు ఆందోళనకు దిగారు.

Updated at - 2022-11-29T16:31:08+05:30