సీఎం కేసీఆర్కు షర్మిల షాక్... ఆస్తులపై సీబీఐకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-10-05T03:10:30+05:30 IST
ఈనెల 6న వైఎస్ షర్మిల (Ys Sharmila) ఢిల్లీ వెళ్లనున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం (Kcr Government)పై ఆమె సీబీఐ (Cbi), కేంద్ర హోంశాఖ (Central Home Department)కు ఫిర్యాదు చేయనున్నారు..
హైదరాబాద్: సీఎం కేసీఆర్ను వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వేలకోట్లు సంపాదించారని.. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆమె పాదయాత్రలో ఇన్నాళ్లు అంటూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఆస్తులపై నేరుగా సీబీఐ, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. డైరెక్ట్గా ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులతో పాటు హోంశాఖ అధికారులనూ ఆమె కలవనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరపాలని కోరనున్నారు.
ఈ మేరకు షర్మిల 6న (Ys Sharmila) ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతరం సీబీఐ (Cbi), కేంద్ర హోంశాఖ అధికారులను కలుస్తారు. సీఎం కేసీఆర్ ఆస్తులపై ఫిర్యాదు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Project)లో జరిగిన అవినీతిపైనా విచారణ జరిపించాలని షర్మిల కోరనున్నారు.
ఇక సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్తున్న విషయం తెలిసిందే... దసరాకు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. మరికొన్ని గంటల్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం కానుంది.