Vinaya Bhaskkar: బీసీ నేతలపై ఈడీ, ఐటీ దాడులా?

ABN , First Publish Date - 2022-11-18T12:50:59+05:30 IST

తెలంగాణలో బీసీ నేతలపై ఈడీ, ఐటీ దాడులను టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(Trs mla Dasyam Vinaya Bhaskkar) ఖండించారు. బీసీ ప్రధాని అయ్యాక ఆ వర్గాలకు ఏమైనా చేస్తారని అంతా ఆశలు పెట్టుకున్నారని.. తీరా చూస్తే

Vinaya Bhaskkar: బీసీ నేతలపై ఈడీ, ఐటీ దాడులా?
ఈడీ, ఐటీ దాడులా?

హైదరాబాద్: తెలంగాణలో బీసీ నేతలపై ఈడీ, ఐటీ దాడులను టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(Trs mla Dasyam Vinaya Bhaskkar) ఖండించారు. బీసీ ప్రధాని అయ్యాక ఆ వర్గాలకు ఏమైనా చేస్తారని అంతా ఆశలు పెట్టుకున్నారని.. తీరా చూస్తే బియ్యం గింజ అంత కూడా మేలు చేయలేదని ఆయన విమర్శించారు. బీసీల ఆశలు అడి ఆశలు చేశారని ఆరోపించారు. బీసీలకు మోడీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే.. బీజేపీ నేషనల్ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. నేడు కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. బీసీల కోసం కేసీఆర్ 310 రెసిడెన్షియల్ పాఠశాలలు.. 33 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారని వినయ్ భాస్కర్ గుర్తుచేశారు.

Updated Date - 2022-11-18T12:51:00+05:30 IST