కేసీఆర్ మాట్లాడేవన్నీ అబద్ధాలే : విజయశాంతి
ABN , First Publish Date - 2022-02-19T20:13:56+05:30 IST
సీఎం కేసీఆర్ మాట్లాడేవన్ని అబద్ధాలేనని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. భాష మార్చుకోవాలని..
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మాట్లాడేవన్ని అబద్ధాలేనని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. భాష మార్చుకోవాలని కేసీఆర్కు పలుమార్లు చెప్పానన్నారు. జవాన్లను కూడా కించ పరిచేలా కేసీఆర్ మాట్లాడారన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రధాని మోదీని తిట్టే హక్కు కేసీఆర్కు లేదని విజయశాంతి పేర్కొన్నారు.