కొండపైకి వాహనాలను అనుమతించాలి
ABN , First Publish Date - 2022-04-05T09:30:13+05:30 IST
లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి స్థానికుల వాహనాలను అనుమతించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
యాదగిరిగుట్టలో కొనసాగుతున్న ఆందోళనలు
యాదాద్రి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి స్థానికుల వాహనాలను అనుమతించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్టలో సోమవారం స్థానికులతో పాటు మునిసపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్తోపాటు పాలకవర్గం, ఆటోడ్రైవర్లు వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో గీత స్థానికులతో అవమానకరంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆమె దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని, తమను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్లకార్డులతో ఆటోడ్రైవర్లు నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు. గుట్ట మునిసిపల్ పాలకవర్గం ఘాట్ రోడ్డుపై గంటకుపైగా ధర్నాకు దిగింది. ఈ ధర్నాకు టీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. కాగా, యాదగిరిగుట్టపై నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జేఏసీ నేతలు మంగళవారం బంద్కు పిలుపునిచ్చారు.