మునుగోడు కోసం TRS భారీ ప్లాన్

ABN , First Publish Date - 2022-10-04T17:33:09+05:30 IST

మునుగోడు (Munugode) కోసం టీఎర్ఎస్ (TRS) భారీగా ప్లాన్ చేస్తోంది. దసరా (Dasara) తెల్లారి నుంచే మునుగోడు ప్రచార పర్వంలోకి

మునుగోడు కోసం TRS భారీ ప్లాన్

Nallagonda : మునుగోడు (Munugode) కోసం టీఆర్ఎస్ (TRS) భారీగా ప్లాన్ చేస్తోంది. దసరా (Dasara) తెల్లారి నుంచే మునుగోడు ప్రచార పర్వంలోకి టీఎర్ఎస్ శ్రేణులు (TRS leaders) ప్రవేశించనున్నారు. త్వరలో చండూరులో సీఎం కేసీఆర్ (CM KCR) బహిరంగ సభ నిర్వహించనున్నారు. మునుగోడును కేసీఆర్ 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను నియమించారు. అలాగే హరీష్ రావు (Harish Rao), కేటీఆర్‌ (KTR)కు సైతం ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో యూనిట్‌కు 20 మంది నేతలతో ప్రచార టీమ్‌ను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6 నుంచి గడప గడపనూ చుట్టేసేలా స్కెచ్ వేశారు. దసరా మరుసటి రోజే మునుగోడుకు వెళ్లాలని ఇన్‌చార్జ్‌లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేపే మునుగోడు అభ్యర్థిని అధికారికంగా కేసీఆర్ ప్రకటించనున్నారు.

Updated Date - 2022-10-04T17:33:09+05:30 IST