Mla Rajasingh: హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తోంది.. జగన్‎పై తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-31T00:31:41+05:30 IST

తిరుపతి (Tirupati) అలిపిరి చెక్ పోస్టు వద్ద మహారాష్ట్ర భక్తుల కార్లపై ఉన్న ఛత్రపతి శివాజీ (Chhatrapathi Sivaji) స్టిక్కర్స్‌ను పోలీసులు తొలగించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్...

Mla Rajasingh: హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తోంది.. జగన్‎పై తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్ (Hyderabad): తిరుపతి (Tirupati) అలిపిరి చెక్ పోస్టు వద్ద మహారాష్ట్ర భక్తుల కార్లపై ఉన్న ఛత్రపతి శివాజీ (Chhatrapathi Sivaji) స్టిక్కర్స్‌ను పోలీసులు తొలగించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Bjp Mla Rajasingh) తప్పుబట్టడారు. శివాజీ ఫొటోలను తొలగించడం వల్ల మహారాష్ట్ర (Maharashtra)లో తిరుపతిని బాయ్ కాట్ చేయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం (Jagan Government) తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. సీఎం జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలసని.. అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలపై ఉన్న స్టిక్కర్స్‌ను తీయొద్దని వెంటనే ఆదేశాలు జారీ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. 



Updated Date - 2022-07-31T00:31:41+05:30 IST