Revanth Reddy: ఆ రెండు పార్టీలవి రాజకీయ డ్రామాలు

ABN , First Publish Date - 2022-10-12T02:10:28+05:30 IST

Hyderabad: టీఆర్ఎస్‌, బీజేపీ రాజకీయ డ్రామాలాడుతున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలని టీఆర్ఎస్‌, బీజేపీ నాయకులు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి..మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శత్రువు

Revanth Reddy: ఆ రెండు పార్టీలవి రాజకీయ డ్రామాలు

Hyderabad: టీఆర్ఎస్‌, బీజేపీ రాజకీయ డ్రామాలాడుతున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలని టీఆర్ఎస్‌, బీజేపీ నాయకులు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి..మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శత్రువు దగ్గర చేరి.. తల్లి లాంటి కాంగ్రెస్‌ను చంపాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కమ్యూనిస్టులతో కేసీఆర్‌ పొత్తు పెట్టుకున్నాడని ఆరోపించారు. చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం.. ప్రచారం కోసం ఉంచిన జెండాలు, పోస్టర్లు తగలబడడం అనుమానాలకు తావిస్తోందని.. టీఆర్ఎస్‌, బీజేపీ నేతలే ఈ ఘటనకు ఒడిగట్టి ఉంటారని ఆరోపించారు.   

Updated Date - 2022-10-12T02:10:28+05:30 IST