కౌలు రైతు అత్మహత్య
ABN , First Publish Date - 2022-07-05T10:28:55+05:30 IST
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం జిన్నారానికి చెందిన కౌలురైతు బోయిని నర్సింహులు(34) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు.
బంట్వారం(కోట్పల్లి), జూలై 4 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం జిన్నారానికి చెందిన కౌలురైతు బోయిని నర్సింహులు(34) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండెకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న నర్సింహులు పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు చేశాడు. దిగుబడి లేక అప్పు తీరకపోవడంతో ఆదివారం పురుగుమందు తాగాడు.