దారుణం... ఇద్దరు యువకుల దుర్మరణం
ABN , First Publish Date - 2022-10-06T23:58:25+05:30 IST
దారుణం... ఇద్దరు యువకుల దుర్మరణం
నిజామాబాద్: జిల్లాలోని డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు అజయ్, సామెల్గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.