కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు

ABN , First Publish Date - 2022-07-06T00:03:19+05:30 IST

కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు రాశారు. ఏపీపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది.

కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు

హైదరాబాద్: కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు రాశారు. ఏపీపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఏపీలోని రెండు ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం, అలాగే బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్ట్‌లు చేపట్టరాదని పేర్కొంది. 2 కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని తెలంగాణ పేర్కొంది. కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై మరో లేఖ కూడా రాసింది. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని లేఖలో కోరింది. తాగునీటి కోసం కాకుండా ఇతర అవసరాలకు తరలింపు సరికాదన్నారు. పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదని పేర్కొంది. అలాగే అనుమతి లేని పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని తెలంగాణ కోరింది. 

Updated Date - 2022-07-06T00:03:19+05:30 IST