ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-12-06T18:24:12+05:30 IST
మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు కంటే తానే ఎక్కువ చదివానని అన్నారు. పాటలు పాడి ఎగురుకుంటూ ఎమ్మెల్యేని కాలేదన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే డాక్టరేట్ చేశానని రసమయి బాలకిషన్ వ్యాఖ్యానించారు. శంకరపట్నం మండలం కన్నాపూర్ లో జరిగిన అబేద్కర్ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు.