హైదరాబాద్లో భారీ కుట్ర...జాహిద్ అరెస్ట్లో కీలక విషయాలు
ABN , First Publish Date - 2022-10-03T00:03:44+05:30 IST
హైదరాబాద్లో భారీ కుట్ర...జాహిద్ అరెస్ట్లో కీలక విషయాలు
హైదరాబాద్: జాహిద్ అరెస్టులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సీసీఎస్, సిట్లో జాహిద్ అండ్ టీమ్పై కేసు నమోదు చేశారు. జాహిద్తోపాటు ఏడుగురిపై సిట్ కేసు నమోదు చేసింది. సుజి, సమియుద్దిన్, అదీల్ అఫ్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్లపై కేసు నమోదు చేశారు. పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్స్ ద్వారా జాహిద్కు నిధులు అందినట్లు పోలీసులు వెల్లడించారు. టెర్రర్ దాడుల కోసం పాక్ నుంచి ఉగ్రవాదులు గ్రనేడ్స్ పంపినట్లు తెలిపారు. జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోలో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర పన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడులకు కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. గతంలో జాహిద్ను అధికారులు ప్రశ్నించారు. జాహిద్ పాకిస్తాన్లో ఐఎస్ఐలకు చెందిన హ్యాండ్లర్స్తో లింక్లు ఉన్నాయి. హైదరాబాద్లో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.