ఆయన మరీ సిల్లీ వ్యాఖ్యలు చేస్తున్నారు: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2022-10-03T22:36:50+05:30 IST
ఆయన మరీ సిల్లీ వ్యాఖ్యలు చేస్తున్నారు: మంత్రి హరీష్రావు
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహించినట్లు మంత్రి హరీష్రావు తెలిపారు. వైద్య విద్యను ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ ఏడేళ్లలో 12 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామన్నారు. నర్సింగ్ కాలేజీల సంఖ్యను 19కి పెంచుకున్నామన్నారు. అలాగే జిల్లాల్లో స్పెషల్ టీమ్స్తో ఆస్పత్రుల్లో తనిఖీలు చేశామన్నారు. 100కి పైగా ఆస్పత్రులు సీజ్ చేశామని, 600కు పైగా ఆస్పత్రులకు నోటీసులు అందించామని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు ఆయన మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో బీజేపీ పాత్ర ఎక్కడ ఉందో చెప్పాలి? అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా ఉండి కిషన్రెడ్డి సిల్లీ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎయిమ్స్లో ఒక్క వసతి కూడా లేదన్నారు. ఎయిమ్స్ విద్యార్థులు భువనగిరిలో ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలకు మాటలే తప్ప పని చేతకాదని విమర్శించారు.