డీజీపీతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి సమావేశం
ABN , First Publish Date - 2022-11-24T19:14:04+05:30 IST
డీజీపీ మహేందర్రెడ్డితో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ సమావేశమయ్యారు.
హైదరాబాద్: డీజీపీ మహేందర్రెడ్డితో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ సమావేశమయ్యారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య, పరిణామాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అటవీ సిబ్బందికి పోలీస్ శాఖతో మరింత సమన్వయం, సహకారం పీసీసీఎఫ్ కోరింది. తమ సిబ్బందికి తగిన ఆదేశాలు ఇస్తామని డీజీపీ వెల్లడించారు.