ఎస్సై వేధింపులే దీనికి కారణం: కుటుంబీకులు
ABN , First Publish Date - 2022-11-23T16:09:55+05:30 IST
జిల్లాలోని మల్యాల మండలం బలవంతపూర్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
జగిత్యాల: జిల్లాలోని మల్యాల మండలం బలవంతపూర్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మల్యాల ఎస్.ఐ వేధిస్తున్నాడంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం వీడియోను అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనపై రౌడీషీట్ ఓపెన్ చేసి ఎస్.ఐ వేధిస్తున్నాడంటూ అనిల్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు.