కేసీఆర్, కేఏ పాల్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-10-06T22:21:16+05:30 IST
కేసీఆర్, కేఏ పాల్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కేసీఆర్ ఎందుకు కొత్త పార్టీ పెడుతున్నారు? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించిన పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదన్నారు. భారత్ రాష్ట్ర సమితి అంటే అర్థమేంటో సీఎం కేసీఆర్ చెప్పాలని సూచించారు. కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ పెట్టారని అన్నారు. సొంత విమానం కొన్నవాళ్లు ఇద్దరే.. కేసీఆర్, కేఏ పాల్ పేర్కొన్నారు. కేసీఆర్, కేఏ పాల్ పొత్తు పెట్టుకుంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.