సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

ABN , First Publish Date - 2022-11-28T21:05:18+05:30 IST

పాదయాత్రకు ప్రజాధరణను చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

నిర్మల్: పాదయాత్రకు ప్రజాధరణను చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఏదో ఒక విధంగా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత యాత్రను కుట్రపూరితంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్రను ప్రారంభించానని ఆయన చెప్పారు. భైంసాను సెన్సిటివ్ ప్రాంతంగా మార్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే యాత్రను కొనసాగిస్తామన్నారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ ప్రజల్లో తిరగాలని సవాల్ విసిరారు. ఫామ్‌హౌజ్‌లో కాదు ప్రజల దగ్గరకు వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

Updated Date - 2022-11-28T21:05:20+05:30 IST